టోక్యో పారాలింపిక్స్.. భారత్కు సిల్వర్ మెడల్ సాధించిన ప్రవీణ్ కుమార్
admin September 3, 2021 0 COMMENTS
పారాలింపిక్స్, 2021లో భారత్కు మరో పతకం లభించింది. టీ64 పురుషుల హై జంప్లో ప్రవీణ్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు.2.07 మీటర్ల జంప్ తో ఆయన సిల్వర్ ను సాధించాడు. 2.10 మీటర్ల జంప్ తో బ్రిటన్ కు చెందిన జొనాథన్ ఎడ్వర్డ్స్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. అంతేకాదు సరికొత్త ఆసియన్ రికార్డును కూడా నెలకొల్పాడు. వరల్డ్ నెంబర్ 3 ప్రవీణ్ కుమార్ సాధించిన విజయంతో ఈ పారాలింపిక్స్లో భారత్ పతకాల సంఖ్య 11కు చేరింది. వాటిల్లో 2 గోల్డ్, 6 సిల్వర్, 3 బ్రాంజ్ ఉన్నాయి. పారాలింపిక్స్లో రజత పతకం సాధించిన ప్రవీణ్ కూమార్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ప్రవీణ్ పుట్టినప్పటి నుంచి ఒక కాలు పొడవు మరొక కాలు పొడవు కన్నా తక్కువగా ఉంది. ఆయన బాల్యం నుంచి క్రీడలపట్ల ఆసక్తిని ప్రదర్శించేవాడు. వాలీబాల్ పై మక్కువ చూపాడు. శరీర అవయవాలన్నీ సక్రమంగా ఉన్న వారితో హై జంప్ పోటీల్లో పాల్గొన్నాడు. శారీరక సామర్థ్య లోపాలుగలవారికి కూడా ప్రత్యేకంగా క్రీడా పోటీలు ఉన్నాయని తెలుసుకున్నాడు. ఆయనకు డాక్టర్ సత్యపాల్ సింగ్ శిక్షణ ఇచ్చారు. దుబాయ్ లో జరిగిన పారా అథ్లెటిక్స్ లో బంగారు పతకాన్ని సాధించి, ఆసియా రికార్డును సాధించాడు. ఇప్పుడు ఒలింపిక్స్ లో భారత పతకాన్ని రెపరెపలాడించాడు.




