
హైదరాబాద్ నగరం గణేశ్ నవరాత్రి ఉత్సవాల శోభను సంతరించుకున్నది. ఖైరతాబాద్లో పంచముఖ రుద్ర గణపతి కొలువయ్యాడు. స్వామివారికి 60 అడుగుల గరికమాల, జంద్యం, కండువా సమర్పించార పద్మశాలీలు. ఖైరతాబాద్ గణనాథుడికి తొలిపూజ జరిగింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై…హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పూజలో పాల్గొన్నారు. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటారు ఇక్కడ. ఎత్తులోనూ అంతే ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుకుంటూ పోతారు. అందుకే, ఒక్క భాగ్యనగర వాసులే కాదు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకునేందుకు వస్తుంటారు. గణేష్ ఉత్సవాల దృష్ట్యా ఖైరతాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులు సొంత వాహనాల్లో రావద్దని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. మెట్రో, ఎంఎంటీఎస్, బస్సుల్లో రావాలని పోలీసులు వినతి చేశారు. హెచ్ఎండీఏ పార్కింగ్ స్థలంలో వాహనాల పార్కింగ్కు అనుమతినిచ్చారు. వృద్ధులు, నడవలేని వారికి మింట్ కాంపౌండ్లో పార్కింగ్కు అనుమతి ఇచ్చారు.ణేశ్ ఉత్సవాల దృష్ట్యా ఈనెల 19 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు.




