
ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలై.. ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న చిత్రం‘ జైభీమ్’. సూర్య కథానాయికుడిగా, జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ మేసేజ్ ఓరియెంటెడ్ మూవీ….28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ‘జై భీమ్’ సినిమా దేశవ్యాప్తంగా హిట్ టాక్ సంపాదించుకుంది. కొండ ప్రాంతానికి చెందిన ఈ దంపతుల యదార్థ ఘటనల ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం జై భీమ్. ఇటీవల ఈ సినిమా చూసిన తమిళ నటదర్శకుడు రాఘవ లారెన్స్ .. రాజకన్ను, పార్వతి అనే దంపతులను ఆధారంగా చేసుకుని రాజన్న, సినతల్లి పాత్రలను రూపొందించారు.నిజ జీవితంలో తమిళనాడులోని ఇరులార్ తెగకు చెందిన పార్వతి అనే మహిళ.. తన భర్త రాసకన్న విషయంలో జరిగిన అన్యాయంపై మానవ హక్కుల ఉద్యమనేత, లాయర్ చంద్రును ఆశ్రయించింది. ఆయనతో కలిసి న్యాయ పోరాటం సాగింది. రాజకన్ను భార్య పార్వతి పడిన బాధని చూసి చలించిపోయిన లారెన్స్ వారికి సొంత ఇల్లును నిర్మించి ఇస్తానని వాగ్దానం చేశారు. దర్శకుడు జ్ఞానవేల్ పై ప్రశంసలు కురిపించారు. కాగా, కరోనా సంక్షోభ సమయంలోనూ ఫ్రంట్ లైన్ కార్మికులు, ట్రాన్స్జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులకు లారెన్స్ ఎంతగానో సాయం చేశారు. ఏకంగా రూ. 5 కోట్లకు పైగా విరాళం అందజేశారు.




