
తెలంగాణలో బుధవారం రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ”ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. విదేశాల నుంచి వచ్చినవారి కాంటాక్ట్ ట్రేస్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో కరోనా పరీక్షలు కూడా పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 98 శాతం పూర్తి అయిందని తెలిపారు. ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని పేర్కొన్నారు.అలాగే రాష్ట్రంలో 2 డోసుల వ్యాక్సినేషన్ కూడా 64 శాతం పూర్తైనట్లు వివరించారు. బూస్టర్ డోస్ కోసం కేంద్రాన్ని కోరామన్నారు. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు ముందస్తుగా 21 లక్షల ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేశామని పేర్కొన్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




