
బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో “THE GREEN PUZZLE” పుస్తకాన్ని ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ శ్రీ మణికొండ వేదకుమార్ విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్(ఢిల్లీ ), చైర్మన్ డాక్టర్ భాస్కర్ రావు రచించారు. సహజ వనరుల నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను తీసుకురావడంలో ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ ఎన్నో సమావేశాలను నిర్వహించింది. మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ.. చెట్లు నరకడం వలన అనేక సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఈ ప్రకృతిలో మమేకమైన చెట్లు. నదులు, వాగులు, వంకలు. మరియు నీటి కాలువలను కాపాడటమే మన లక్ష్యంగా పెట్టుకోవాలని తెలియజెప్పారు. పర్యావరణ రక్షణకై కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ ‘ ది గ్రీన్ పజిల్ ‘ పుస్తకంలో భాస్కర్ రావు గారు లిఖించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘువీర్ IFS, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (రిటైర్డ్) , ప్రగతి రిసార్ట్స్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ జి.బి.కె.రావు, శ్రీ ఎం.హెచ్.రావు, FBH వైస్ ప్రెసిడెంట్ , సీనియర్ పాత్రికేయుడు, హెచ్ఎంటివి దశ-దిశ నిర్వహకుడు రామచంద్ర మూర్తి, శోభా సింగ్ , ఫోరం సభ్యులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.




