
ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖను అదనంగా అప్పగించారు. ఈ దస్త్రంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంతకం చేశారు. ఇప్పటి వరకు హరీశ్ రావు ఆర్థిక శాఖను మాత్రమే పర్యవేక్షించేవారు. ఇక నుంచి రెండు శాఖలను పర్యవేక్షిస్తారని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. ప్రస్తుతం ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ వద్దే ఉంది.అప్పట్లో వైద్యారోగ్యశాఖ బాధ్యతలు చూసిన ఈటల రాజేందర్పై భూకబ్జా ఆరోపణలు రావడంతో ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత హరీశ్ ప్రాధాన్యం తగ్గుతుందని రాజకీయ విశ్లేషకులు ఊహించారు.ఈ ఆరోపణలను అబద్ధం చేస్తూ హరీశ్రావుకు కీలకమైన వైద్యారోగ్య శాఖను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.దీంతో ఇక నుంచి ఆర్ధిక శాఖతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించనున్నారు.




