ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డా ఎం.మండల్ స్మారక సమావేశం
admin May 18, 2023 0 COMMENTS
ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డా: ఎం.మండల్ స్మారక సమావేశం షోయబ్ హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి లో ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్ అధ్యక్షతన జరిగింది . ఫోరం సభ్యులు ఆయన ఆత్మ శాంతి కై ఒక నిమిషం మౌనం పాటించారు.

Er.మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ ఆయన బ్యాంక్ లో పదవీ విరమణ తరవాత ఫోరం (FBH) కార్యక్రమాలలో భాగస్వాములైయ్యారు . హైదరాబాద్ పర్యావరణం, అర్బన్,హెరిటేజ్ అంశాల పై ఆయన కున్న లోతైన అవగాహన, ఆ అంశాల పై ఏర్పడిన సమస్యలపై స్పందించి వాటిని పరిష్కరించటానికై ప్రభుత్వానికి ఫోరం తరఫున ప్రతిపాదనలు తయారు చేయటం వాటిని జాప్యం లేకుండా పంపటంలో ఆయన పోషించిన గణనీయమైన పాత్ర ను కొన్నియాడారు.
ఫోరం వైస్ చైర్మన్ ఎం.హెచ్.రావు మండల్ గారి యొక్క కార్యసాధకత, పనిలో ఆయన కున్న నిక్కచ్చితనం, పారదర్శకత గురించి వివరించారు.
ఫోరం జాయంట్ సెక్రెటరీ సంఘమిత్ర మాలిక్ మట్లాడుతూ మండల్ గారు ఏదైన సమస్యల పరిష్కారం గురించి ఫోరం తరఫున ప్రభుత్వం తో ఆయన చేసే ప్రతిపాదనల పై నిరంతర ఫాలో అప్ గురించి గుర్తుచేసుకున్నారు.. బెంగాలీ సంప్రదాయ పరంగా ఆయన జ్ఞాపకార్థం ఒక కవితా పఠనంతో నివాళి అర్పించారు.
ఒ.ఎం.డెబారా మట్లాడుతూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని, ఆయన కున్న భాష పరిజ్ఞానాన్ని, శైలిని కొనియాడారు. ఫోరం జనరల్ సెక్రెటరీ శోభాసింగ్ సమాజ సేవ కై ముఖ్యంగా హైదరాబాదు కు ఆయన చేసిన సేవలు మరువలేనివని ఆయన లేని లోటు భర్తీ చేయలేమని తెలిపారు. COVA సంస్థ అధ్యక్షుడు మజహర్ హుస్సేన్ తమ సంస్థ ద్వారా మండల్ గారి తో ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ మరియు సివిల్ సొసైటీ సభ్యులు జస్వీన్ జైరత్, వై.. సుభాష్ రెడ్డి, పి.నరహరి, ఆదర్శ్, ఇలియాస్ ఖాన్, మహ్మద్ అఫ్జల్, కె.శ్రీహరి, మహ్మద్ తురాబ్, జి.వేణుగోపాల్ రావు,కె.అనిత, కె.అనురాధ, వి.బాలరాజ్ గౌడ్, పి.పూర్ణచందర్ రావు, పి.శ్రీనివాస్, రఘునాథ్, డి.మహేష్, శ్రీధర్, నర్సింహ, అంబిక, టి.స్వప్న, వి.ఉషారాణి,.ఎస్.జయశ్రీ తదితరులుపాల్గొన్నారు..





