
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’ సినిమా పతాక సన్నివేశాల్లో ‘తోడుగా మా తోడుండి అంటూ ’గుండెను కదిలించే పాటను పాడిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పస్తం మొగిలయ్య కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ వరంగల్ సంరక్ష ఆసుపత్రిలో డయాలసిస్ నిర్వహిస్తుండగా, మొగిలయ్యకు గుండెపోటు వచ్చింది. దాంతో, కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటీన హైదరాబాద్ తరలించారు. మొగిలయ్య ఏడాది కాలంగా బీపీ, షుగర్తోపాటు రెండు కిడ్నీలు ఫెయిలై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వారానికి మూడుసార్లు వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకున్నాడు. దీంతో తన భర్త ప్రాణాలను కాపాడాలని, ప్రభుత్వం ఆదుకోవాలని భార్య కొమురమ్మ వేడుకున్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




