
తెలంగాణలో మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కల సాకారం కావడానికి ఎంతో మంది కృషి చేశారని అన్నారు. దేశంలోనే తొలిసారి నదిలేని చోట ప్రాజెక్టు నిర్మాణం చేసింది ఇక్కడే. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా పది జిల్లాలకు తాగు, సాగు నీరు అందించే ఒక మహోన్నతమైన జలసాగరంగా మల్లన్న సాగర్ రూపకల్పన జరిగిందని కేసీఆర్ అన్నారు.ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలిలో కట్టడం సాధ్యం కాదు. భూమ్మీదనే కట్టాలి. ముంపునకు గురైన గ్రామాలకు న్యాయం చేస్తాం. భూనిర్వాసితులకు న్యాయం చేస్తాం. చరిత్రలో ఇప్పటి వరకు ఇవ్వనటువంటి పరిహారం ఇచ్చాం.కాళేశ్వరం ప్రాజెక్ట్లో అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్. భూములు కోల్పోయిన వారి త్యాగం వెలకట్టలేనిది. ప్రతి ఒక్కరికి నష్ట పరిహారం ఇవ్వాలి. ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం, నష్టం జరగాలని కోరుకోను.హరీశ్రావు సేవలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయి. అవినీతిరహితంగా పని చేశాం. ఇది ఒక మల్లన్న సాగర్ కాదు.. తెలంగాణ జన హృదయం సాగరం.




