
కొవిడ్ నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలను జనవరి 2 వరకు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో పబ్స్, హోటళ్లు, క్లబ్లకు న్యూఇయర్ గైడ్ లైన్స్ పాటించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో న్యూ ఇయర్ ఆంక్షలు అమలు అవుతాయని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించని వారికి నిబంధనలను అనుసరించి వెయ్యు రూపాయల ఫైన్ ను విదించనున్నామని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. పబ్బులు, ఈవెంట్స్పై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా పాటించాలన్నారు. జనవరి 2వ తేదీ వరకు ర్యాలీలు, సభలను నిషేధిస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.




