
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, గవర్నర్ తమిళ సై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. హకీంపేట నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరి వెళ్లారు. గచ్చిబౌలి స్టేడియంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో ఆమె పాల్గొంటారు. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై వెళ్లి ఆమెకు వెల్కమ్ పలికారు. పుష్పగుచ్ఛం ఇచ్చి అభివాదం చేశారు. సీఎం కేసీఆర్తో పాటు సీఎస్ శాంతికుమారి, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా రాష్ట్రపతి ముర్ముకు పుష్పగుచ్ఛాలు అందించారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




