
ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్కు ఫ్యాక్స్కాన్ సీఈఓ యంగ్లియూ లేఖ రాశారు. కేసీఆర్కు రాసిన లేఖలో ఆయన హైదరాబాద్ ఆతిథ్యం పట్ల థ్యాంక్స్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొంగరఖాలాన్లో ఫ్యాక్స్ఖాన్ పార్క్ పెడుతున్నట్లు యంగ్లియూ ప్రకటించారు. ఈ పార్క్ ఏర్పాటుకు తమ సహకారం కావాలని అన్నారు. మార్చి రెండో తేదీన ఫాక్స్కాన్ చైర్మెన్ యంగ్ లియూ.. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి పట్ల మీకు ఉన్న విజన్ నన్ను ఎంతో ప్రేరణకు గురిచేసిందని లియూ అన్నారు. ఇండియాలో తనకు ఓ కొత్త ఫ్రెండ్ దొరికినట్లు లియూ తన లేఖలో చెప్పారు. భవిష్యత్తులోనూ కేసీఆర్తో కలిసి పనిచేసేందకు ఉత్సాహాంగా ఉన్నట్లు తెలిపారు. కొంగరకలాన్లో రూ.3500 కోట్ల పెట్టుబడితో ఫాక్స్కాన్ ఎలక్ట్రానిక్ కంపెనీని నెలకొల్పేందుకు తైవాన్ దేశం ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కంపెనీకి 250 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే సర్వే నం.300లో 187 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ కేటాయించింది. కేసీఆర్ను తైవాన్కు ఆహ్వానిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ముందుగానే హామీ ఇచ్చినట్లు లేఖలో తెలిపారు. రాబోయే రోజుల్లో ఫ్యాక్స్కాన్ పార్క్ ద్వారా లక్షకుపైగా ఉద్యోగాలు రాబోతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి తైవాన్కు మధ్య మైత్రి సంబంధాలు కొనసాగాలని పేర్కొన్నారు.




