
భద్రాచలం వరద ముంపు బాధితుల ఆవేదనను అర్థం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ విజ్ఞప్తి చేశారు. భద్రాచలం పక్కనే ఉన్న గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని కోరుతున్నాం. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడంలో కొంత నిర్లక్ష్యం చేసినందువల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందని తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మొదటినుంచి తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. కరకట్టలు గతంలో కట్టినా అవి పటిష్టంగా లేవు అని, సిఎం కెసిఆర్ శాశ్వత పరిష్కారం కోసం నిపుణుల కమిటీ ప్రకటించారన్నారు. కరకట్టల నిర్మాణానికి 5 గ్రామాలకు ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




