
ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై పంచాయితీ ఢిల్లీకి చేరింది. తనకు జరుగుతున్న అవమానాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై ఫిర్యాదు చేశారు. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన సమగ్ర నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. గురువారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే.గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం మొదలు మండలి ప్రొటెమ్ చైర్మన్ నియామకం, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం, మేడారం జాతర, యాదగిరిగుట్ట పర్యటనలో ప్రొటోకాల్, తదితర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
RELATED ARTICLES
LEAVE A COMMENT




