
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో విద్యా సంస్థలకు ఈ నెల 8 నుండి 16 వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో ప్రజలు పట్టణ ప్రాంతాల నుండి పల్లె ప్రాంతాలకు తరలిపోతున్నారు. సికింద్రాబాద్లో ప్లాట్ఫాం టికెట్ ధర రూ.10 ఉండగా.. రూ. 50కి పెంచినట్లు వెల్లడించింది. మిగతా అన్ని స్టేషన్లలో రూ.10 నుంచి రూ.20కి పెంచుతున్నట్లు పేర్కొంది. సంక్రాంతి పండగ వల్ల రైల్వేస్టేషనల్లో పెరిగిన రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. పెంచిన ప్లాట్ ఫాం ధరలు నేటి నుంచే అమలులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 20 వరకు ఈ ధరలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.




