
తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరంగా వ్యాప్తిస్తోంది. రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు.ఈ సందర్భగా ఆయన గురువారం మాట్లాడుతూ.. తెలంగాణలో త్వరలోనే ఒమిక్రాన్ కేసులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే 2,3 వారాలు చాలా కీలకమని వెల్లడించారు. ఒమిక్రాన్ బాధితులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నారని, ఇది థర్డ్వేవ్ ప్రారంభానికి సూచిక అని తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించిందని ఆయన చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందన్నారు. యూకే, యూఎస్ లాంటి దేశాల్లో ఒక్కసారి కేసులు లక్షల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్, సంక్రాంతి వేడుకలు వస్తున్నాయన్నరు. పబ్లిక్ మూమెంట్ భారీగా ఉంటుందన్నారు. దీంతో వచ్చే సంక్రాంతికి కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం అవుతుందన్నారు డీహెచ్. వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లకు కూడ కోవిడ్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఓమిక్రాన్ వ్యాధి లక్షణాలు 90శాతం మందిలో కనిపించడం లేదన్నారు. లక్షణాలు లేని వ్యక్తిని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. గతంలో కరోనా రెండు దశల్లో వ్యాప్తి జరిగినప్పుడు కరోనాపై విజయం సాధించామని చెప్పుకొచ్చారు.రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. థర్డ్ వేవ్ అరికట్టేందుకు చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉందామన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు.




