
ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన ‘న్గడగ్ పేల్ గి ఖోర్లో’ను మోదీకి ఇవ్వనున్నట్టు ఆ దేశ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ఇవ్వాలని భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నగ్మే వాంగ్ చుక్ సూచించారని తెలిపింది. భూటాన్ జాతీయ దినోత్సవం(డిసెంబరు 17) సందర్భంగా ఈ పౌర పురస్కారానికి ప్రధాని మోడీని ఎంపిక చేసినట్లు ఆ దేశ ప్రధాని లోటే షీరింగ్ (Lotay Tshering) శుక్రవారం సోషల్ మీడియాలో ప్రకటించారు.చాలా ఏళ్లుగా.. మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ప్రధాని మోడీ తమ దేశానికి అందించిన బేషరతు సాయాన్ని మర్చిపోలేమని భూటాన్ ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. భూటాన్ ప్రజల తరఫున ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపింది.ఒక గొప్ప నేత, గొప్ప ఆధ్యాత్మికవేత్త మోదీ అని కొనియాడింది. మోదీకి పురస్కారాన్ని అందించేందుకు ఎదురుచూస్తున్నామని తెలిపింది. మోదీని వ్యక్తిగతంగా కలిసి వేడుక జరుపుకోవడానికి ఎదురు చూస్తున్నాను.’’ అని భూటాన్ ప్రధానమంత్రి లోటే షేరింగ్ ఫేస్బుక్లో పోస్టు చేశారు.




