
దక్షిణాఫ్రికాలో కొవిడ్19 కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో బ్రిటన్, ఇయు దేశాలుసహా ప్రపంచం అప్రమత్తమైంది.ఈ వేరియంట్ ఇప్పటికే ఇజ్రాయెల్, హాంకాంగ్, బోట్స్వానాతోపాటు కొన్ని పొరుగుదేశాలకు వ్యాప్తి చెందింది. దాంతో, బోట్స్వానా, లెసోథో, ఎస్వాతిని, జింబాంబ్వే, నమీబియా దేశాల నుంచి ప్రయాణాలపై శుక్రవారం నుంచి నిషేధం విధిస్తున్నట్టు యుకె ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్19 స్పైక్ ప్రోటీన్లో పెద్ద సంఖ్యలో మ్యుటేషన్స్ (ఉత్పరివర్తనాలు)ను గుర్తించినట్టు యుకె ఆరోగ్య భద్రతా ఏజెన్సీ(ఉఖ్సా) పేర్కొన్నది. వైరస్ జీనోమ్లోని మిగతా భాగాల్లోనూ మ్యుటేషన్స్ను గుర్తించారు.అంతర్జాతీయ ప్రయాణికులపై ఇప్పటికే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. కొవిడ్ కొత్త వేరియంట్పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.కరోనా కొత్త వేరియంట్ తీవ్రంగా ఉన్న దక్షిణాఫ్రికా దేశం నుంచి నేరుగా హైదరాబాద్ కు ఎలాంటి విమాన సర్వీసులు లేని కారణంగా ముంబయి, ఢిల్లీలో దిగి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చే వారి ట్రేసింగ్, టెస్టింగులకి సంబంధించి మంత్రి హరీష్ రావు చర్చించనున్నట్లు సమాచారం. ముందస్తు నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు రేపు ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ విస్తరణ తీరు, నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై వైద్య నిపుణులు, ఉన్నతాధికారులతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు.




