
వచ్చే ఏడాది టీ20 క్రికెట్ వరల్డ్కప్ టోర్నీ ఆస్ట్రేలియాలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీకి చెందిన ఏడు వేదికలను ఖరారు చేశారు. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ప్రపంచకప్ జరగనుంది. మొత్తం 45 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందుకు బ్రిస్బేన్, అడిలైడ్, గీలాంగ్, హోబార్ట్, పెర్త్, సిడ్నీ, మెల్బోర్న్ నగరాలను వేదికలుగా అధికారులు ప్రకటించారు. సిడ్నీ, అడిలైడ్లలో సెమీస్లు జరగనుండగా, నవంబర్ 13న మెల్బోర్న్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.టీ20 వరల్డ్కప్ కోసం 12 జట్లు లైనప్లో ఉన్నాయని, క్వాలిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు వేచి ఉండాల్సి ఉందని ఈవెంట్ హెడ్ క్రిస్ టెట్లే తెలిపారు.దుబాయ్లో తాజాగా ముగిసిన టీ20 వరల్డ్కప్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫైనల్ రన్నరప్ న్యూజిలాండ్తో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, పాకిస్థాన్, సౌతాఫ్రికాలు కూడా వచ్చే టోర్నీకి సెలక్ట్ అయ్యాయి. మిగతా నాలుగు స్థానాల కోసం శ్రీలంక, వెస్టిండీస్ తదితర జట్లు క్వాలిఫయింగ్ టోర్నీల్లో తలపడనున్నాయి.




