అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మంది ప్రమాణస్వీకారం
admin August 31, 2021 0 COMMENTS
సుప్రీం కోర్టులో మంగళవారం ఉదయం అపూర్వ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒక్కరోజే తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణస్వీకారం చేశారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వీరితో ప్రమాణం చేయించారు. న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సి.టి. రవికుమార్, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ బేలా మాధుర్య త్రివేది, జస్టిస్ పమిడిగంథం శ్రీనరసింహలు ప్రమాణం చేశారు. ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. జస్టిస్ హిమా కోహ్లీ ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన విషయం తెలిసిందే. కాగా, సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి తొమ్మిది మంది ఎప్పుడూ ప్రమాణస్వీకారం చేయలేదు.ఈ అపూర్వ వేడుకకు సుప్రీంకోర్టు అదనపు భవన ఆవరణంలోని ఆడిటోరియం వేదికయింది. సుప్రీంకోర్టుకు ఉండాల్సి న న్యాయమూర్తుల సంఖ్య 34. ఈ ఘట్టాన్ని మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేయడం ఒక చరిత్ర. సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి ప్రత్యక్ష ప్రసారమైన జడ్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమం.

