
ఆగస్టు 14వ తేదీని ఇక నుంచి విభజన స్మృతి దినంగా ( Partition Horrors Remembrance Day ) గుర్తించనున్నట్లు ప్రధాని మోదీ ఇవాళ ప్రకటించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను ఆగస్టు 15న జరుపుకుంటున్న నేపథ్యంలో మోదీ ఈ ప్రకటన చేశారు. స్వాతంత్ర్యం రావడానికి కొన్ని గంటల ముందు పాకిస్థాన్ కు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ దేశం భారత్ నుంచి విడిపోయింది. ఆ విభజన సమయంలో కొన్ని లక్షల మందిని ఊచకోత కోశారు. కొన్ని కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. మన ప్రజల సంఘర్షణ, త్యాగాలను స్మరించుకుంటూ, ఆగస్టు 14ను భయానక విభజన గాయాలు గుర్తుకొచ్చే రోజుగా పాటిస్తామన్నారు. ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్గా జరుపు కోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా సామాజిక విభేదాలు, అసమానతలు అనే విషాన్ని తొలగించడంతోపాటు, ఏకత్వం, సామాజిక సామరస్యం, మానవ సాధికారతా స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవాల్సి అవసరం ఉందని ప్రధాని మోదీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.దేశ విభజనతో ప్రజల్లో సామాజిక విద్వేషాలు వచ్చాయని, సామరస్యం లోపించిందన్నారు మోడీ.




