
ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇక ఎంసెట్లో పొందే మార్కుల ఆధారంగానే ర్యాంకు కేటాయిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యద ర్శి వాకాటి కరుణ జీవో 18ని జారీ చేశారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీని అమలు చేస్తూ 2011లో అప్పటి ప్రభుత్వం జీవో 73 జారీ చేసింది. ఎంసెట్ మార్కులకు 75 శాతం, ఇంటర్లోని భాషేతర సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును ఇస్తున్నారు. ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎత్తివేయాలని ఉన్నత విద్యామండలి ప్రతిపాదనతో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ ఫలితాల సమయం నాటికి ఇతర బోర్డుల ఫలితాలు వెలువడకపోతే ఆ విద్యార్థులకు తర్వాత ర్యాంకులు కేటాయిస్తారు. ఈ కారణాలతో కొన్ని సందర్భాలలో ఫలితాలు కూడా ఆలస్యమవుతుంటాయి. గత మూడేళ్లుగా ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీ లేకపోవడంతో ఫలితాలు సకాలంలోగా సజావుగా వెలువడుతున్నాయి. ఈ విషయాలన్నింటినీ సమీక్షించిన విద్యాశాఖ ఇంటర్ మార్కుల వెయిటేజ్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసకుంది. కరోనా కారణంగా గత రెండేండ్లుగా వెయిటేజీ నుంచి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు శాశ్వతంగా ఎత్తివేసింది.



