
నీటిపై తేలియాడే సోలార్ పలకలతో 100 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న (ప్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు) ఎన్టీపిసి రామగుండం ప్రాజెక్టును నేడు ప్రధాని మోడీ జాతికి అంకితం. ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్బంగా నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు తెలంగాణలో ఆవిష్కృతం కావడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్టీపీసీ జలాశయంలో 600 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైనట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.ఈ ప్రాజెక్టు ద్వారా 31 వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ ను సరఫరా చేయవచ్చని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్టీపిసి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో రూ.483 కోట్ల వ్యయంతో ఈ సోలార్ ప్రాజెక్టును నెలకొల్పారు. బిహెచ్ఈఎల్ ఈ ప్లాంట్ను నిర్మించగా మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్లాంట్ నిర్మాణం కోవిడ్ కారణంగా ఆలస్యం అయ్యింది. పర్యావరణ సహిత దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు మన తెలంగాణలో ఉండటం మనందరికీ గర్వకారణని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు 100 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఏడాదికి 1.5 లక్షల టన్నుల ఖర్చు అయ్యే బొగ్గు వినియోగం కూడా తగ్గడంతో 1.11 లక్షల టన్నుల కార్భన్డైయాక్సైడ్ ఉత్పత్తిని కూడా నివారించుకోవడం తగ్గిందని ఎన్టిపిసి అధికారులు తెలిపారు.




