
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ 12 గేట్లు, ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. నేడు వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లోని మూసారంబాగ్ బ్రిడ్డి వరద నీటిలో మునిగిపోయింది. చాదర్ఘాట్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి కాలనీలు నీటమునిగాయి.
RELATED ARTICLES
LEAVE A COMMENT




