
మొదటి రోజు స్కూల్స్కు పిల్లలు ఉత్సాహంగా వచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మన ఊరు మనబడి కింద స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.9 వేల కోట్లతో 26 వేల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం నగరంలోని మెహబూబియా స్కూల్కు వచ్చిన మంత్రి , విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి వెల్ కమ్ చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీషు మీడియా ప్రవేశ పెట్టిన సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.రాష్ట్రంలోని గురుకులాల్లో సుమారు 4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. గురుకుల సూల్స్లో సీటు కోసం ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ బడులు ఉంటాయన్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




