
దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నకరోనా వైరస్ కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.సోమవారం దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 30 మంది మృతిచెందారు. 862 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గత వారం రోజుల నుంచి 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు రెట్టింపవ్వడం కలవరపెడుతోంది. ప్రస్తుతం దేశంలో 16,522 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.కరోనాబారిన పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో రోజువారీ పాజివిటీ రేటు 0.84 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని వెల్లడించింది.దీంతో తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారని అధికారులు శనివారం చెప్పారు.




