
కరోనా టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సోమవారం చార్మినార్ యునాని ఆస్పత్రిలో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, వైద్య శాఖ అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లతో పాటు 60 ఏళ్లు పైబడి ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు బూస్టర్ డోసుకు అర్హులు అని వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రకటించింది.అర్హులంతా తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి.నేరుగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అపాయింట్మెంట్ను బుక్ చేసుకోవచ్చు. ప్రికాషనరీ డోస్ టీకా షెడ్యూల్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.బూస్టర్ డోసు కోసం ప్రత్యేకంగా ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదని స్పష్టం చేసింది. గతంలో ఏ కంపెనీకి చెందిన టీకా రెండు డోసులు తీసుకున్నారో ఇప్పుడు కూడా అదే టీకా వేస్తారు.




