
ఇళ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్దతిలో బస్తీవాసులకు ఇళ్ల కేటాయింపు ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభించామని వెల్లడించారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడని పెద్దలు అంటారు. మార్కెట్లో రూ.40 లక్షల విలువచేసే ఇంటిని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.మిగతావి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. నగరంలోని పేదల అందరికీ ఇళ్లు ఇచ్చేలా చూస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం ఇప్పటి వరకు 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా మంత్రి తెలిపారు. ఇక్కడ ఇల్లు పొందిన వారు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు దొరకని వారికి రాబోయే రోజుల్లో న్యాయం చేస్తామన్నారు కేటీఆర్. ఇండ్ల కేటాయింపులన్నీ లాటరీ పద్దతిలోనే ఇస్తామన్నారు. డబ్బులు ఎవరైనా అడిగితే ఫిర్యాదు చేయాలన్నారు.




