
ఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.నిలోఫర్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన 100 పడకల యూనిట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మీడియాతో మాట్లాడారు.కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆస్పత్రులను బలోపేతం చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.18 కోట్లు అందించామని చెప్పారు. రూ.10 వేల కోట్లు కేటాయించి ఆరోగ్యశాఖను అభివృద్ధి చేశామని మంత్రి వెల్లడించారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ఉన్న డెలివరీ రేట్.. కేసీఆర్ కిట్ వచ్చాక 50 శాతానికి పెరిగింది. తల్లి, పిల్లల మరణాలు గణనీయంగా తగ్గాయి. నగరం నలువైపులా నాలుగు మెడికల్ టవర్లు తీసుకురావాలని కృషి చేస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి మరో 8 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకురానున్నాం. రూ. 33 కోట్లతో నిలోఫర్లో మరో 800 పడకలను అందుబాటులోకి తీసుకొస్తాం. కరోన థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రూ. 133 కోట్లు కేటాయించాం. చిన్న పిల్లల కోసం 5000 పడకలను సిద్ధంగా ఉంచాం.




