
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in వెబ్సైట్లో చూడవచ్చు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల ఎంసెట్ ర్యాంకులను ప్రకటించారు. గతంలో ఇంటర్లో 45 శాతం మార్కులు ఉంటేనే ఇంజనీరింగ్ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ పరీక్షలు రద్దు కావడంతో ఇప్పుడు ఎంసెట్లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్కు అర్హులుగా అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 4, 5, 6 (ఇంజినీరింగ్), 9, 10 తేదీల్లో (వ్యవసాయ, ఫార్మా ఎంసెట్) పరీక్షను నిర్వహించారు. ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షకు 90 శాతం మంది హాజరుకాగా… అగ్రికల్చర్, మెడికల్ ఎంట్రన్స్కు 91.19 శాతం మంది విద్యార్థలు హాజరయ్యారు.ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ మొదటి విడత ఈనెల 30న ప్రారంభమవుతుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తామని, సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవాలని వెల్లడించారు.




