
మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను సోమవారం ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు మార్చి 29తో ముగియనున్నాయి. మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ, బ్రిడ్జి వంటి పరీక్షలు ఏప్రిల్ 4న ముగుస్తాయి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఫస్టియర్ పరీక్షలు, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు సెకండియర్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. కరోనా సమయంలో సిలబ్సను 70శాతానికి కుదించి పరీక్షలను నిర్వహించారు. ఈసారి పరీక్షలను 100 శాతం సిలబస్ తో నిర్వహిస్తారు. మార్చి 4న నైతికత, మానవ విలువలు(ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూ స్)పరీక్ష, మార్చి 12న పర్యావరణ విద్య(ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్) పరీక్ష ఉంటుంది.




