
నదులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది – ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్
ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్, “ప్రపంచ నదుల దినోత్సవం, కెనడా” ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డెక్కన్ హెరిటేజ్ అకాడమీ మరియు జెబిఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్ సంయుక్తంగా ఆదివారం సాలార్జంగ్ మ్యూజియం వద్ద ‘మూసీ రివర్ ఫ్రంట్ వాక్’ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద కుమార్ మాట్లాడుతూ.. ఫోరం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వరల్డ్ రివర్స్ డే వ్యవస్థాపకులు మార్క్ ఏంజెలో అభినందనలు తెలిపినట్లు చెప్పారు.

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని నీటి సరఫరా కొరతను అధిగమించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-ప్రయోజకరమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణాన్ని చేపట్టి విజయం సాధించారన్నారు. దేశంలో నదులు మరింత కలుషితం అవుతున్నాయని అన్నారు. హైదరాబాద్ పూర్వపు తాగు నీటి వనరైన మూసీ నది యొక్క ప్రాముఖ్యత, రక్షణ, పునరుద్ధరణపై ప్రజలకు అవగాహన పెంచడానికి ఈ వాక్ ఏర్పాటు చేశామన్నారు. నీటి మార్గాలు, జలమార్గాలతో మన జాతీయ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారం అని చెప్పారు.
దేశంలో నీటివనరుల ద్వారా ఆర్థిక, పారిశ్రామిక , జీవనోపాధి మరియు పర్యాటక రంగాలలో ఎంతో పురోగతి సాధించవచ్చని ఈ వాక్ లో ఆయన తెలిపారు. అనంతరం చారిత్రాత్మక మూసీ నది ప్రాముఖ్యతను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ, ఎక్సెల్ ఇండియా, Ar.క్వాజిత్ తౌసిఫ్ ఇక్బాల్l, Ar.ఇవాన్ అభిషేక్, ఫోరమ్ సభ్యులు G.వేణుగోపాలరావు, పి.నరహరి, ఎండీ.అఫ్జల్, సుదర్శన్ రెడ్డి, ఆదర్శ్, పర్యావరణవేత్తలు, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు, JAINAPUR FOUNDATION, AMAN VEDIKA, APSA, SAVE GOLCONDA, SRD Rainbow Home, SCSE సామాజిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, ఆఫ్జల్ గంజ్ ఎస్ఐ వి.రాంబాబు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్, జె.ఎన్.టి.యు ఆక్స్ ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ కళాశాల, పాఠశాలల నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





