
దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నేటితో పదవీ కాలం పూర్తి చేసుకోనున్నారు. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై విచారణను ప్రత్యక్షప్రసారం చేసింది. రాజకీయ పార్టీల ఉచితాలపై త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది. 2013 నాటి తీర్పు పునఃపరిశీలనకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లిలతో కూడిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఎన్నికల ప్రజాస్వామ్యంలో నిజమైన అధికారం ఓటర్లదేనని అభిప్రాయపడింది. పార్టీల పనితీరును వాళ్లే నిర్ణయిస్తారు అని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు ఉచితాలను వాగ్దానం చేసే ఆచరణకు సంబంధించిన తీవ్రమైన అంశంపై చర్చ తప్పక జరగాలని అన్నారు. జస్టిస్ యూయూ లలిత్ 49వ సీజేగా విధులు నిర్వర్తించనున్నారు.




